రేపు సెలవు.. చంద్రగ్రహణం ప్రభావం, ఎల్లుండి హోలీ వేడుకలు!

Published on

-Advertisement-

మన భారత్ , న్యూఢిల్లీ:

హోలీ పండుగ తేదీపై ప్రజల్లో నెలకొన్న అయోమయం వీడింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ల ప్రకారం రేపు (మార్చి 3) పబ్లిక్ హాలిడేగా ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడతాయి. అయితే అదే రోజు చంద్రగ్రహణం ఉండటంతో హోలీ వేడుకలను ఎప్పుడు నిర్వహించాలి అనే సందేహం భక్తుల్లో వ్యక్తమవుతోంది.

పండితుల సూచనల మేరకు చంద్రగ్రహణ ప్రభావం దృష్ట్యా రంగుల హోలీని మార్చి 4 (బుధవారం) జరుపుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. సంప్రదాయంగా హోలీకి ముందు రోజు రాత్రి జరిగే కామ దహనం (హోలికా దహనం) కార్యక్రమాన్ని రేపు రాత్రి నిర్వహించాలని సూచిస్తున్నారు.

హిందూ సంప్రదాయంలో హోలీ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మేలుకు విజయం సాధించిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకోవడం ఆనవాయితీ.

ఈ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వ సెలవును దృష్టిలో ఉంచుకుని రేపు కామ దహనం నిర్వహించి, ఎల్లుండి రంగుల హోలీ జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. భక్తులు గ్రహణ సమయంలో ఆచారాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలిపారు.

పండుగ సందర్భంలో చిన్నారులు, యువత ప్రత్యేక ఉత్సాహంతో సిద్ధమవుతుండగా, మార్కెట్లలో రంగులు, పిచ్కారీలకు డిమాండ్ పెరిగింది. వ్యాపారులు కూడా పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు

Latest articles

రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే...

రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను...

దారుణం.. 80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:  తిరుపతి నగరంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన...

సీఎం పర్యటన.. ఇసుక రవాణా నిషేధం

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యల భాగంగా...

More like this

రైళ్లలో మగవారికి ఉచిత ప్రయాణం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే...

రైతులకు శుభవార్త.. 45 లక్షల రైతులకు లాభం

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం రెండో విడత నిధులను...

దారుణం.. 80 ఏండ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:  తిరుపతి నగరంలో 80 ఏళ్ల వృద్ధురాలిపై దాడి చేసి లైంగిక దాడికి పాల్పడిన ఘటన...