మున్సిపల్ ఎన్నికల్లో ‘బడా’ నేతలకు భంగపాటు

Published on

-Advertisement-

సొంత వార్డుల్లోనే ఓటమి… జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్

మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ (ADB) మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖ నేతలకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న నానుడి ఈసారి తలకిందులైనట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమైన నాయకుల పరిస్థితి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

Jogu Ramanna కుటుంబానికి ఎదురుదెబ్బ.

మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. స్థానిక స్థాయిలో బలమైన పట్టు ఉందని భావించినప్పటికీ, ఓటర్లు వేరే తీర్పు ఇవ్వడం గమనార్హం.

కాంగ్రెస్, బీజేపీ నేతలకు కూడా నిరాశ

కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత తమ సొంత వార్డుల్లో అభ్యర్థులను విజయతీరాలకు చేర్చలేకపోయారు. అలాగే బీజేపీకి చెందిన సుహాసిని రెడ్డి కూడా తన ఇలాకాలో విజయం సాధించలేకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది.

స్థానిక రాజకీయ సమీకరణాల్లో మార్పు?

దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి రావడం జిల్లా రాజకీయ సమీకరణాల్లో మార్పులకు సంకేతమా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక అసంతృప్తి, వర్గపోరాటాలు, అభ్యర్థుల ఎంపికలో లోపాలు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఫలితాలు భవిష్యత్ ఎన్నికల్లో పార్టీల వ్యూహాలను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆదిలాబాద్ రాజకీయాల్లో ఈ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Latest articles

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...

విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ ..

మొగుళ్ళపల్లి విద్యుత్ శాఖ నూతన ఏఈగా గుగులోతు నగేష్ బాధ్యతల స్వీకరణ -బాధ్యతలు చేపట్టిన ఏఈ గుగులోత్ నగేష్ ను...

More like this

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్

నకిలీ ఫోన్‌పేతో రూ.7,610 మోసం.. ఇద్దరు నిందితులు అరెస్ట్ మూడు నూనె డబ్బాలు కొనుగోలు చేసి నకిలీ చెల్లింపు.. దొంగ...

20 న మంత్రి జూపల్లి రాక..

ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం.. జూలై 20న ఉట్నూరులో మంత్రి జూపల్లి పర్యటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ప్రత్యామ్నాయ...

ఘనంగా అందెశ్రీ జయంతి..

జయ జయహే "తెలంగాణ" గీతంతో..తెలంగాణ ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నతమైన వ్యక్తి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన వేముల...