కవిత కొత్త పార్టీకి ‘తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ’ పేరు.?

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ:

ఈ ఏడాది మేలో కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై ప్రకటించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీ పేరుపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మే మొదటి వారంలో శుభ ముహూర్తం చూసుకుని పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తామని, పేరులో ‘తెలంగాణ’ పదం తప్పనిసరిగా ఉంటుందని ఆమె ముందుగానే సంకేతాలు ఇచ్చారు.

ఇప్పటికే పార్టీ పేరును  తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ (TPJP)గా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడుతోంది. అయితే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది. కొత్త పార్టీ ద్వారా తెలంగాణ స్వాభిమానం, సామాజిక న్యాయం, యువత–మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలని కవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు అనుచర వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ జెండా రంగులపై కూడా చర్చ సాగుతోంది. పసుపు, ఎరుపు రంగులతో జెండాను రూపొందిస్తున్నట్లు సమాచారం. పసుపు అభివృద్ధి, ఆశయాలను సూచిస్తే, ఎరుపు పోరాట స్పూర్తిని ప్రతిబింబిస్తుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

పార్టీ గుర్తుపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘కాగడా’ లేదా ‘కళ్లజోడు’ గుర్తులపై దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఎన్నికల సంఘం అనుమతి అనంతరం మాత్రమే అధికారిక గుర్తు ఖరారవుతుంది.

కొత్త పార్టీ ఆవిర్భావంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కవిత అనుచరులు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.

Latest articles

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...

More like this

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...