మన భారత్, ఆదిలాబాద్:
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా జామిడి గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలు పంపిణీ చేశారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్న మహోన్నత నాయకుడని ఈ సందర్భంగా ప్రసంగించిన నాయకులు పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధి దిశగా విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పుస్తకాలను అందజేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలోని పాఠశాల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలని సంకల్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
