మెస్రం విలాస్ ఘన విజయం – 269 ఓట్ల మెజారిటీతో గెలుపు
మన భారత్ ఆదిలాబాద్:
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 19వ వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి మెస్రం విలాస్ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో బీజేపీ అభ్యర్థి మెస్రం విలాస్కు 713 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ అభ్యర్థి మహేందర్కు 444 ఓట్లు దక్కాయి.
దీంతో మెస్రం విలాస్ 269 ఓట్ల స్పష్టమైన మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యాక బీజేపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
19వ వార్డులో ప్రజలు అభివృద్ధి, పారదర్శక పాలనను దృష్టిలో పెట్టుకొని బీజేపీకి మద్దతు తెలిపారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో స్థానిక సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మెస్రం విలాస్ హామీ ఇచ్చారు.
ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో బీజేపీ బలం మరింత పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
