నాగోబా జాతర ఆదాయం రూ.20.74 లక్షలు

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయంలో నిర్వహించిన జాతరకు భారీ ఆదాయం లభించింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టగా, మొత్తం జాతర ఆదాయం రూ.20,74,797గా నమోదైనట్లు దేవాదాయ శాఖ ఈవో ముక్త రవి తెలిపారు.

నాగోబా ఆలయంలో మెస్రం వంశీయులు, దేవాదాయ–ధర్మదాయ శాఖ అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. భక్తుల విశేష సహకారంతో తైబజార్ ద్వారా రూ.11,81,000 ఆదాయం లభించగా, హుండీ ద్వారా రూ.8,93,797 ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

జాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు నాగోబా ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించారని, వారి భక్తి శ్రద్ధలకు ప్రతిబింబంగానే ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. జాతర నిర్వహణలో శాంతిభద్రతలు, ఏర్పాట్లకు సహకరించిన అన్ని శాఖలకు దేవాదాయ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి పనులు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Latest articles

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...

ఆర్టీసీ సమ్మెకు ప్రత్యామ్నాయం… ప్రైవేట్ వాహనాలతో సేవలు

మన భారత్, హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు...

More like this

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

ప్రైవేట్ వాహనాలకు పండుగ.. అధిక ఛార్జీలు

మన భారత్ | తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం...

ఆర్టీసీ సమ్మె ప్రభావం.. ప్రయాణికుల ఇబ్బందులు

  మన భారత్, హైదరాబాద్ :  తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు అర్ధరాత్రి నుంచి సమ్మెబాట పట్టడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా...