సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా నారాయణ రెడ్డి

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల నూతన సర్పంచుల సంఘాన్ని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘ కార్యవర్గాన్ని సమ్మతితో ఎంపిక చేశారు.

ఈ ఎన్నికల్లో కజ్జర్ల గ్రామానికి చెందిన సర్పంచ్ ఎల్మ నారాయణ రెడ్డిని మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. తలమడుగు గ్రామానికి చెందిన ఎలుగు రాజన్నతో పాటు పూనగూడ గ్రామానికి చెందిన పెందూర్ హన్మంతులను ఉపాధ్యక్షులుగా ఎంపిక చేశారు. పెద్ద పల్లి గ్రామానికి చెందిన కట్కం సంజీవ్ ను కోశాధికారిగా, రుయ్యాడి గ్రామానికి చెందిన ఉడుగు రాకేష్ ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే సకినాపూర్ గ్రామానికి చెందిన మెస్రం నిఖిత నగేష్ ను మహిళా ప్రధాన కార్యదర్శిగా, సుంకిడి గ్రామానికి చెందిన మగ్గిడి నర్సమ్మ ప్రకాష్ ను ప్రచార కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సంఘ నాయకులు మాట్లాడుతూ, మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు సకాలంలో చేరేలా కృషి చేస్తామని తెలిపారు. గ్రామాల మధ్య సమన్వయం పెంచి, స్థానిక స్వయంపాలన సంస్థల బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని వారు పేర్కొన్నారు. సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

Latest articles

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

More like this

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...