అక్రెడిటేషన్ జర్నలిస్టులే వాహనాలపై ‘PRESS’ స్టిక్కర్ వినియోగించాలి: DPRO విష్ణువర్ధన్

Published on

మన భారత్, ఆదిలాబాద్:
అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జర్నలిస్టులుగా అక్రెడిటేషన్ లేకుండా ఇతర వర్గాల వారు లేదా వ్యక్తులు ఇష్టారీతిన తమ వాహనాలపై ‘PRESS’ అని రాసుకోవడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు మోటార్ వాహన చట్టం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అధికారిక గుర్తింపు లేకుండా ‘PRESS’ స్టిక్కర్ వినియోగించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని, అలాగే భద్రతా పరంగా సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు.

కాబట్టి జిల్లాలోని జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని, అక్రెడిటేషన్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘PRESS’ స్టిక్కర్ వాడకూడదని DPRO విష్ణువర్ధన్ సూచించారు. నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటాయని ఆయన హెచ్చరించారు.

Latest articles

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

ఆదిలాబాద్ 43వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి కలాల్ శ్రీనివాస్ విజయం

ప్రధాన పార్టీలకు షాక్ – 323 ఓట్ల భారీ మెజారిటీ మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో...

More like this

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...