అక్రెడిటేషన్ జర్నలిస్టులే వాహనాలపై ‘PRESS’ స్టిక్కర్ వినియోగించాలి: DPRO విష్ణువర్ధన్

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:
అక్రెడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే తమ వాహనాలపై ‘PRESS’ అనే స్టిక్కర్ అట్టించుకోవాలని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ ప్రియాంక ఆదేశాలు జారీ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

జర్నలిస్టులుగా అక్రెడిటేషన్ లేకుండా ఇతర వర్గాల వారు లేదా వ్యక్తులు ఇష్టారీతిన తమ వాహనాలపై ‘PRESS’ అని రాసుకోవడం చట్టవిరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి చర్యలు మోటార్ వాహన చట్టం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. అధికారిక గుర్తింపు లేకుండా ‘PRESS’ స్టిక్కర్ వినియోగించడం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని, అలాగే భద్రతా పరంగా సమస్యలు తలెత్తవచ్చని తెలిపారు.

కాబట్టి జిల్లాలోని జర్నలిస్టులు తమ అక్రెడిటేషన్ చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలని, అక్రెడిటేషన్ లేని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ‘PRESS’ స్టిక్కర్ వాడకూడదని DPRO విష్ణువర్ధన్ సూచించారు. నిబంధనల ఉల్లంఘనపై సంబంధిత శాఖలు చర్యలు తీసుకుంటాయని ఆయన హెచ్చరించారు.

Latest articles

హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో చోటుచేసుకున్న హత్య కేసులో నిందితుడిని పోలీసులు...

గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణపై రైతుల ఆందోళన

మన భారత్, మొగుళ్ళపల్లి: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణలో అన్యాయం జరుగుతోందని మొగుళ్ళపల్లి మండల...

గురుకులంలో సమస్యల పరిష్కారానికి చర్యలు 

మన భారత్, మొగుళ్ళపల్లి: భూపాలపల్లి జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, విద్యార్థులకు...

మే లో కూతురి పెళ్లి.. తండ్రి ఆత్మహత్య

మన భారత్ ,ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పుల భారంతో పాటు కూతురి పెళ్లి బాధ్యతలు...

More like this

హత్య కేసులో నిందితుడి అరెస్ట్ ..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో చోటుచేసుకున్న హత్య కేసులో నిందితుడిని పోలీసులు...

గ్రీన్ ఫీల్డ్ హైవేకు భూసేకరణపై రైతుల ఆందోళన

మన భారత్, మొగుళ్ళపల్లి: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం చేపడుతున్న భూసేకరణలో అన్యాయం జరుగుతోందని మొగుళ్ళపల్లి మండల...

గురుకులంలో సమస్యల పరిష్కారానికి చర్యలు 

మన భారత్, మొగుళ్ళపల్లి: భూపాలపల్లి జిల్లాలోని మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, విద్యార్థులకు...