మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం..

Published on

-Advertisement-

మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఘన ఆహ్వానం.. అసెంబ్లీలో జాతర పోస్టర్ ఆవిష్కరణ

మన భారత్, తెలంగాణ : ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ , ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జాతర ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కి అందజేశారు. అనంతరం మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతర పోస్టర్‌ను ముఖ్యమంత్రి  అధికారికంగా ఆవిష్కరించారు. ఈ మహాజాతర ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని, కోట్లాది మంది భక్తుల ఆరాధనకు కేంద్రంగా మారిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం మహాజాతరను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రత, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని సీఎం వెల్లడించారు. జాతర విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

Latest articles

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...

బీసీల హక్కుల కోసం పోరాటం..

మన భారత్, మొగుళ్ళపల్లి: బీసీలను రాజకీయంగా అణగదొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్...

More like this

భరత నాట్యంలో మెరిసిన చిన్నారి.‌!

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం...

ఆటో బోల్తా .. ఒకరి మృతి

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలంలో జరిగిన ఆటో ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో...

ఆ ఏటీఎంలో మృతదేహం..!

మన భారత్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీలో ఉన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి...