సాయి కిరణ్ కు ఘన సన్మానం..

Published on

-Advertisement-

యూపీఎస్సీలో పొన్నారి యువకుడి సత్తా – సాయి కిరణ్‌కు ఘన సన్మానం

మన భారత్, ఆదిలాబాద్ : జిల్లా తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ–గంగన్న దంపతుల కుమారుడు సాయి కిరణ్ యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) పరీక్షల్లో ఆల్ ఇండియా 82వ ర్యాంకు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. సాయి కిరణ్ సాధించిన ఈ ఘన విజయాన్ని గుర్తిస్తూ పొన్నారి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆయనను శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల నుంచి జాతీయ స్థాయిలో ప్రతిభను చాటిన సాయి కిరణ్ యువతకు ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. కష్టపడి చదివితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనే విషయాన్ని ఆయన నిరూపించారని అభినందించారు. విద్య, పట్టుదల, లక్ష్య సాధనతోనే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.

సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు, స్థానిక ప్రజలు పాల్గొని సాయి కిరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో దేశ సేవలో కీలక బాధ్యతలు నిర్వహించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Latest articles

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

More like this

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ..

మన భారత్, మొగుళ్లపల్లి: మొగుళ్లపల్లి మండలంలోని పాత ఇస్సిపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు, అరటి పండ్లు...

తులం బంగారం ఎప్పుడు ఇస్తారో..?

మన భారత్, తలమడుగు: కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనిక్కిందని కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ఆడపడుచులు...

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....