అల్లూరి జిల్లాలో చలి రెచ్చిపోతోంది..

Published on

-Advertisement-

అల్లూరి జిల్లాలో చలి రెచ్చిపోతోంది..
జి.మాడుగులలో 5.3°C… ఉత్తర కోస్తా–ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి

మన భారత్, ఏపీ డెస్క్: రాష్ట్రాన్ని చలి పట్టిపీడిస్తోంది. ఉదయం పూట తీవ్రమైన చలితో ప్రజలు ఇళ్లలోనే వణుకుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున అల్లూరి సీతారామరాజు జిల్లా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. జి.మాడుగుల మండలంలో కనిష్ఠంగా 5.3 డిగ్రీల సెల్సియస్ నమోదై ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖ నమోదు చేసింది.

ఇదిలా ఉంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చలి దంచికొడుతోంది.

  • ముంచంగిపట్టు – 7.7°C
  • డుంబ్రిగూడ – 8.2°C
  • అరకు – 8.9°C
  • చింతపల్లి – 9.5°C
  • హుకుంపేట – 9.6°C

ఆంధ్రా పర్వత ప్రాంతాలతో పాటు తెలంగాణలోని కొండచరియల ప్రాంతాలు కూడా తక్కువ ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి. HYDలోని HCU వద్ద 9°C, BHELలో 10.6°C నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ ప్రకారం, ఈశాన్య గాలుల ప్రభావంతో రాబోయే కొన్ని రోజులు తెల్లవారుజామున చలి మరింత పెరగనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. పర్వత ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...