“సీఎం రేసులో నేనూ ఉన్నా”: హోం మంత్రి

Published on

-Advertisement-

“సీఎం రేసులో నేనూ ఉన్నా” — కర్ణాటక రాజకీయాల్లో హోం మంత్రి పరమేశ్వర సంచలన వ్యాఖ్యలు

మన భారత్, కర్ణాటక: కర్ణాటకలో ఇటీవల నుంచి కొనసాగుతున్న సీఎం మార్పు చర్చలకు కొత్త మలుపు దొరికింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. దళిత వర్గానికి ముఖ్యమంత్రి హోదా ఇవ్వాలని వస్తున్న డిమాండ్ల నేపధ్యంలో “సీఎం రేసులో నేనూ ఉన్నాను” అంటూ ఆయన బహిరంగంగా ప్రకటించారు.

సీఎం Siddaramaiah స్థానంలో కొత్త నాయకత్వంపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలతో రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. ఈ విషయంపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానానిదేనని పరమేశ్వర స్పష్టం చేశారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీతో సంప్రదింపులు జరిగిన తరువాత, AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

అయితే ఇప్పటివరకు సీఎం మార్పు అంశంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్చ జరపలేదని ఆయన పేర్కొన్నారు. పరమేశ్వర వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలకు మరింత ఊపిరి పోశాయి. తదుపరి రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా మారతాయో అనే ఆసక్తి పెరిగింది.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...