తాండూర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్‌

Published on

-Advertisement-

తాండూర్ పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్‌ ఫర్ యూనిటీ – జాతీయ ఐక్యతకు ప్రజల స్పందన

మన భారత్, మంచిర్యాల జిల్లా – తాండూర్:
సర్ధార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా తాండూర్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం “2కే రన్‌ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా జరిగింది. సిఐ దేవయ్య జెండా ఊపి ఈ రన్‌ను ప్రారంభించారు. మాదారం పోలీస్ స్టేషన్ గ్రౌండ్‌ నుండి ఐబీ చౌరస్తా వరకు ఉత్సాహంగా ఈ పరుగుపందెం కొనసాగింది.

ఈ సందర్భంగా సిఐ దేవయ్య మాట్లాడుతూ, “దేశ సమైక్యతకు సర్ధార్ పటేల్ చేసిన సేవలు మరువలేనివి. ఆయన ఆలోచనలను మనం ఆచరణలో పెట్టాలి. కుల, మత, వర్గ విభేదాలను విడనాడి జాతీయ ఐక్యతను చాటుకోవాలి” అని పిలుపునిచ్చారు.

రన్‌లో తాండూర్, మాదారం ఎస్ఐలు కిరణ్ కుమార్, సౌజన్య, స్థానిక నాయకులు, యువకులు, వాటర్స్ సభ్యులు, పోలీసులు మరియు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐక్యత, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నినాదాలు ఇవ్వడం ద్వారా దేశభక్తి ఉత్సాహం నెలకొంది.

ఈ కార్యక్రమం ద్వారా తాండూర్ పోలీస్ శాఖ ప్రజల్లో జాతీయ ఏకత్వం, సామాజిక ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...