డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్

Published on

-Advertisement-

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ 

బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో ఘన నివాళులు

మన భారత్, తలమడుగు:

తలమడుగు మండలం దేవాపూర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షులు దాతాజీ కిరణ్ గారు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. “ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా” అనే లక్ష్యంతో దేశ సమగ్రత కోసం పోరాడి కాశ్మీర్ కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఆయన ఆశయాలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

దేశ ఐక్యత, సమగ్రత కోసం ముఖర్జీ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శానం శ్రీనివాస్, అడెపు శ్రీనివాస్, పిట్ల శేఖర్, రేగుల మోహన్, పోరండ్ల రాములు, విష్ణు, ఓస రవి, గంగాధర్, గంధం నరేష్, సంతోష్, రాజు, రామన్న, పొచ్చన్న, లింగం తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి త్యాగాలను స్మరించుకున్నారు.

Latest articles

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్..

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.....

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని...

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మన భారత్,మొగుళ్ళపల్లి: ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో...

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు

చక్కెర టీకి బదులు బెల్లం టీ.. ఆరోగ్యానికి సహజమైన మేలు జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు పలు ప్రయోజనాలు.....

More like this

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్..

12 ఏళ్లకే ఏఐ స్టార్టప్.. మూడు దేశాల్లో సేవలందిస్తున్న భారతీయ బాలిక వోక్సా పేరుతో వినూత్న ఏఐ టూల్ అభివృద్ధి.....

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం

పోతుగల్లు సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గ్రామ అభివృద్ధి కోసం చేస్తున్న సేవలు అద్భుతం గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని...

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్

మృతుల కుటుంబాలను పరామర్శించిన భూపాలపల్లి ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మన భారత్,మొగుళ్ళపల్లి: ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామంలో...