విద్యార్థులకు భారీ ఊరట..

Published on

-Advertisement-

2022 నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు

మన భారత్‌, హైదరాబాద్‌:
విదేశాల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 సంవత్సరం నుంచి నిలిచిపోయిన అన్ని బకాయిలను వెంటనే చెల్లించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన భట్టి విక్రమార్క, విద్యార్థులకు మరింత ఇబ్బందులు రాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా, విదేశాల్లో ఉన్న విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టేలా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు భారీ ఉపశమనం ఓవర్సీస్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ పథకం కింద వివిధ దేశాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులు చాలా కాలంగా బకాయిలు రావడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, అన్ని వర్గాల విద్యార్థులకూ న్యాయం చేయాలని నిర్ణయించింది. భట్టి విక్రమార్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, “తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం కట్టుబడి ఉంది. ఉన్నత విద్యను అందరికీ అందుబాటులోకి తేవడమే మా లక్ష్యం” అని స్పష్టం చేశారు. స్కాలర్‌షిప్‌ మొత్తాలు త్వరితగతిన విద్యార్థుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...