తప్పిపోయిన మహిళ, ఇద్దరు చిన్నారులను క్షేమం

Published on

-Advertisement-

ఆధునిక సాంకేతికతో హైదరాబాద్‌లో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగింత

మన భారత్, చీపురుపల్లి:
చీపురుపల్లి గ్రామంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన జమ్మూ గౌతమి తన ఇద్దరు చిన్నారులతో కలిసి కనిపించకుండా పోయిన ఘటనలో చీపురుపల్లి పోలీసులు వేగంగా స్పందించి కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమెను క్షేమంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసుల చాకచక్యమైన చర్యలపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, జమ్మూ గౌతమి తన భర్తతో ఉన్న మనస్పర్థల కారణంగా కొంతకాలంగా తన తల్లిదండ్రుల వద్ద నివసిస్తోంది. ఈ సమయంలో ఆమె తన ఇద్దరు పిల్లలు జమ్మూ చక్రధర్, జమ్మూ నిహాల్తో కలిసి ఉంటోంది. కుటుంబంలో అన్న, వదినల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో తాను కుటుంబానికి భారంగా మారకూడదని భావించిన గౌతమి ఎక్కడికైనా వెళ్లి పనిచేసుకుని జీవనం సాగించాలని నిర్ణయించుకుంది.

ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన ఉదయం సుమారు 10 గంటల సమయంలో తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చీపురుపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు Cr.No 33/2026 కింద Woman and Children Missing కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గౌరవ ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గౌతమి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక సమాచారం ఆధారంగా పోలీసులు వేగంగా దర్యాప్తు కొనసాగించి చివరకు హైదరాబాద్లో గౌతమి తన ఇద్దరు పిల్లలతో ఉన్నట్లు గుర్తించారు.

తక్షణమే అక్కడికి చేరుకున్న పోలీస్ బృందం ఆమెను, చిన్నారులను క్షేమంగా గుర్తించి చీపురుపల్లికి తీసుకువచ్చింది. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గౌతమికి కుటుంబ సభ్యులు అండగా ఉండాలని సూచిస్తూ ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు.

చాలా తక్కువ సమయంలోనే తమ కుమార్తెతో పాటు ఇద్దరు చిన్నారులను క్షేమంగా గుర్తించి అప్పగించినందుకు చీపురుపల్లి పోలీసుల పనితీరును కుటుంబ సభ్యులు ప్రశంసించారు. ప్రజలకు భరోసా కల్పించే విధంగా పోలీసులు వ్యవహరించారని స్థానికులు అభినందించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

నూతన గ్రామ కార్యదర్శి పశువైద్యాధికారికి సన్మానం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన దేవాపూర్ గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ – గ్రామ అభివృద్ధికి...

వ్యవసాయ బావిలో పడి పులి మృతి..

దుర్వాసన రావడంతో బయటపడిన ఘటన.. శవపరీక్ష అనంతరం ఖననం మన భారత్, మహారాష్ట్ర: మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపురి...

More like this

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం – ఆత్మగౌరవ పోరాటానికి విజయ చిహ్నం

మన భారత్ , ఆదిలాబాద్:  తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ...

రవితేజ కష్టం ఫలించింది..!

అగ్నివీర్ ఫలితాల్లో సత్తా చాటిన కౌఠ (బీ) గ్రామానికి చెందిన రవితేజ యువతకు ఆదర్శంగా నిలిచిన గ్రామీణ ప్రతిభ మన భారత్,...

నూతన గ్రామ కార్యదర్శి పశువైద్యాధికారికి సన్మానం

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించిన దేవాపూర్ గ్రామపంచాయతీ ఎంపీడబ్ల్యూఎస్ సిబ్బందికి సేఫ్టీ కిట్ల పంపిణీ – గ్రామ అభివృద్ధికి...