పగడ్బందీగా జనాభా గణన నిర్వహించాలి:

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు

దేవాపూర్ గ్రామంలో ఇంటింటి సర్వే తీరును పరిశీలించిన అధికారులు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరుగుతున్న జనాభా గణన ఇంటింటి సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని తహశీల్దార్ రాజమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని దేవాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ల తో మాట్లాడిన తహశీల్దార్, ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్ల సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, జనాభా గణాంకాలు మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో మూడు రోజుల పాటు ఉండి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని తెలిపారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా జనాభా గణన చేపట్టాలని, ప్రతి వివరాలను పక్కాగా నమోదు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగితే భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు కూడా అధికారులకు సహకరించి సరైన సమాచారం అందించాలని తహశీల్దార్ కోరారు. జనాభా గణన ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, వనరుల కేటాయింపు మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోరండ్ల సంతోష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...