పగడ్బందీగా జనాభా గణన నిర్వహించాలి:

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు

దేవాపూర్ గ్రామంలో ఇంటింటి సర్వే తీరును పరిశీలించిన అధికారులు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో జరుగుతున్న జనాభా గణన ఇంటింటి సర్వేను పగడ్బందీగా నిర్వహించాలని తహశీల్దార్ రాజమోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని దేవాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎన్యుమరేటర్ల తో మాట్లాడిన తహశీల్దార్, ప్రతి ఇంటిని సందర్శించి ఇళ్ల సంఖ్య, కుటుంబ సభ్యుల వివరాలు, జనాభా గణాంకాలు మరియు ఇతర అవసరమైన సమాచారాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. గ్రామాల్లో మూడు రోజుల పాటు ఉండి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని తెలిపారు.

ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లు లేకుండా జనాభా గణన చేపట్టాలని, ప్రతి వివరాలను పక్కాగా నమోదు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగితే భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

ప్రజలు కూడా అధికారులకు సహకరించి సరైన సమాచారం అందించాలని తహశీల్దార్ కోరారు. జనాభా గణన ద్వారా ప్రభుత్వ పథకాల రూపకల్పన, వనరుల కేటాయింపు మరింత సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోరండ్ల సంతోష్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...