మంత్రి కొండా సురేఖ సేవలపై ప్రశంసలు..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్ళపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించి, కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దర్శనం పొందారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి మంత్రి సురేఖమ్మ చేసిన కృషి ఎంతో విశేషమని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయాలను తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర కీలకమని అన్నారు.

ప్రస్తుతం యువత పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న నేపథ్యంలో, భారతీయ సాంప్రదాయాలు, సనాతన ధర్మం వైపు మళ్లించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తూ, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు.

భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు మంత్రి కొండా సురేఖకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, కుటుంబాలు ఆనందంగా జీవించాలని వేముల మహేందర్ గౌడ్ దంపతులు ప్రార్థించినట్లు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...

బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే

గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సభ్యత్వ నమోదులో ప్రతి కార్యకర్త...

More like this

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘాయుష్షు, దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు కార్యక్రమానికి హాజరుకానున్న ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్...

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న మన భారత్, తలమడుగు: ప్రజా...

సిక్కోలు అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కులు కీలకం

యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా పరిశ్రమల విస్తరణ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మన భారత్,...