మంత్రి కొండా సురేఖ సేవలపై ప్రశంసలు..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్ళపల్లి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మొక్కులు సమర్పించి, కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో దర్శనం పొందారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సేవలను కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి మంత్రి సురేఖమ్మ చేసిన కృషి ఎంతో విశేషమని పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా దేవాలయాలను తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర కీలకమని అన్నారు.

ప్రస్తుతం యువత పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్న నేపథ్యంలో, భారతీయ సాంప్రదాయాలు, సనాతన ధర్మం వైపు మళ్లించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి భారీ నిధులు కేటాయిస్తూ, భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలోపేతం చేస్తున్నారని అన్నారు.

భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు మంత్రి కొండా సురేఖకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు పుష్కలంగా పండాలని, కుటుంబాలు ఆనందంగా జీవించాలని వేముల మహేందర్ గౌడ్ దంపతులు ప్రార్థించినట్లు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...