అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె.!

Published on

-Advertisement-

మన భారత్, తెలంగాణ: 
తెలంగాణలో ప్రజా రవాణాపై భారీ ప్రభావం చూపేలా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నాయకుల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో, ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభమవుతుందని కార్మిక సంఘాలు ప్రకటించాయి.

సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానుండగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సమ్మె నోటీసులు ఇచ్చి 41 రోజులు గడిచినా, ప్రభుత్వం ఆలస్యంగా చర్చలకు పిలవడం పట్ల జేఏసీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కార్మికుల ప్రధాన డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, సంఘాల ఎన్నికలు నిర్వహించడం, బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపడం వంటి అంశాలు ఉన్నాయని తెలిపారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం సరైన స్పందన ఇవ్వలేదని ఆరోపించారు.

చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసిందని, తమ సమస్యలను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదని జేఏసీ నాయకులు విమర్శించారు. “ఎవరి ఒత్తిళ్లకు మేము తలొగ్గం.. మా హక్కుల కోసం పోరాటం కొనసాగుతుంది” అని స్పష్టం చేశారు.

సమ్మె కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం త్వరితగతిన పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

మన భారత్, విజయనగరం:  గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...

లో లెవల్ వంతెనల పూర్తి ఎప్పుడో.?

మన భారత్, ఆదిలాబాద్:  ఝరి, డోర్లి గ్రామాల ప్రజల ఆవేదన – వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు తలమడుగు: తలమడుగు మండల...

More like this

సూపర్ నారీ పై అవగాహన సదస్సులు..

మన భారత్, విజయనగరం:  గ్రామ సంఘాల్లో “మన డబ్బులు – మన లెక్కలు” సభ్యుల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపే...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై నారాయణరావు

మన భారత్, విజయనగరం:  రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు గుర్ల, జూన్ 6: గుర్ల మండల కేంద్రంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయోగం

మన భారత్, విజయనగరం: పాత టైర్లతో స్పీడ్ లిమిట్ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు డెంకాడ, జూన్ 6: రోడ్డు ప్రమాదాల నివారణే...