బీఎస్పీ ఆఫీసులో ఘనంగా రిజర్వేషన్ డే వేడుకలు
సాహు మహరాజ్ కు నివాళి అర్పించిన పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఇబ్రాం శేఖర్
మన భారత్, జూలై 26 , హైదరాబాద్: బీఎస్పీ రాష్ట్ర కార్యాయంలో రిజర్వేషన్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ జ్యోతిరావు ఫూలే, సాహు మహరాజ్, బీఆర్ అంబేద్కర్, కాన్షీరాం వంటి మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం మరువరాదని అన్నారు. బహుజన రాజ్య స్థాపనే వారికిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తొలిసారిగా 1902 జూలై 26 న కొల్హాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహు మహారాజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జూలై 26 ను దేశంలోని బహుజనులు మరి ముఖంగా బీఎస్పీ రిజర్వేషన్ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఇబ్రాం శేఖర్ సాహు మహరాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి బీ ఈశ్వర్, చీఫ్ జోన్ ఇంచార్జ్ దాగిళ్ల దయానంద్ , కోశాధికారి ఎన్. ప్రణయ్ , మహబూబ్ నగర్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ లు జీ గంగాధర్, బీ జంగయ్య ముదిరాజ్ , జిల్లా అధ్యక్షులు రాంచందర్ , అసెంబ్లీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ , సికింద్రాబాద్ అసెంబ్లీ ప్రెసిడెంట్ జే ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
