కూలర్ షాక్ తో మహిళ మృతి..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు(భీంపూర్):

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కూలర్ స్విచ్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన ఆత్రం మీనాక్షి (32) ఆదివారం రాత్రి ఇంట్లో కూలర్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డ్‌ను తాకింది. ఈ క్రమంలో స్విచ్ బోర్డ్‌లోని ప్రధాన తీగలు తగలడంతో ఆమెకు తీవ్రంగా విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మృతురాలికి భర్త సురేందర్, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వేసవి కాలంలో కూలర్లు, విద్యుత్ పరికరాలు వినియోగించే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

Latest articles

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...

ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో విధులు నిర్వర్తించాలి

పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనలు.. వర్షాకాలంలో నదులు, వాగులు, వంకలు, బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలని...

More like this

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యం

పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలన -సర్పంచ్ నైనకంటి మమత మన భారత్,మొగుళ్ళపల్లి: పచ్చదనం..పరిశుభ్రతే లక్ష్యంగా పిడిసిల్ల గ్రామ పరిపాలనను కొనసాగిస్తున్నామని, పల్లెలు...

ఉద్యమకారుల జేఏసీ మండల కమిటీ ఎన్నిక

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మొగుళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా చదువు అన్నారెడ్డి మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల...

ముగ్గురిపై కేసు నమోదు..

మన భారత్, మొగుళ్ళపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో ఎస్ఐ ముప్పు సురేష్ నేతృత్వంలో పోలీస్...