manabharath.com
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 2:51 pm Editor : manabharath

కూలర్ షాక్ తో మహిళ మృతి..

మన భారత్, తలమడుగు(భీంపూర్):

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో కూలర్ స్విచ్ ఆన్ చేసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామపంచాయతీ పరిధిలోని మందపల్లి గ్రామానికి చెందిన ఆత్రం మీనాక్షి (32) ఆదివారం రాత్రి ఇంట్లో కూలర్ ఆన్ చేయడానికి స్విచ్ బోర్డ్‌ను తాకింది. ఈ క్రమంలో స్విచ్ బోర్డ్‌లోని ప్రధాన తీగలు తగలడంతో ఆమెకు తీవ్రంగా విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించినప్పటికీ అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

మృతురాలికి భర్త సురేందర్, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. వేసవి కాలంలో కూలర్లు, విద్యుత్ పరికరాలు వినియోగించే సమయంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి