మన భారత్, ఆదిలాబాద్:
బోథ్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తెలంగాణ జాగృతి పార్టీలో చేరడం ప్రాంతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు నాయకత్వం మరింత వర్ధిల్లాలని ఆయన యువసేన అధ్యక్షుడు మెంచు కాంతారావు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా రాథోడ్ బాపురావు యువసేన జిల్లా అధ్యక్షుడు కాంతారావు మాట్లాడుతూ.. రాథోడ్ బాపురావు సేవలను ప్రశంసించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన ఎప్పుడూ ముందుండి పనిచేశారని, ఆయనకు ఉన్న ప్రజాభిమానం తెలంగాణ జాగృతి కార్యక్రమాలకు బలం చేకూరుస్తుందని తెలిపారు. ఈ కొత్త దశలో ఆయన నాయకత్వంలో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాథోడ్ బాపురావు తెలంగాణ జాగృతిలో చేరడం ద్వారా పార్టీకి గ్రామీణ స్థాయిలో మరింత బలం చేకూరుతుందని, ముఖ్యంగా యువతను ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయని నాయకులు పేర్కొన్నారు. ఆయన అనుభవం, నాయకత్వ లక్షణాలు పార్టీ అభివృద్ధికి దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువసేన సభ్యులు పాల్గొని రాథోడ్ బాపురావుకు శుభాకాంక్షలు తెలిపారు.
మీరు స్థానిక వార్తలు పోస్ట్ చేయడానికి క్రింది ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
