సమస్యలు పరిష్కరించాలని వినతి..

Published on

-Advertisement-

మన భారత్, తలమడుగు:

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటీఎఫ్ మండల అధ్యక్షులు శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. టీజీ టీజేఏసీ ఆధ్వర్యంలో తలమడుగు మండల కేంద్రంలో ఎంపీడీవో మరియు తహసీల్దార్ కార్యాలయాలకు ఉద్యోగులు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ నిధులను వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు. ఉద్యోగుల హక్కులకు సంబంధించిన అంశాలను నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆయన అన్నారు.

అలాగే ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేయాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ యుటీఎఫ్‌కు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

Latest articles

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...

బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ

మన భారత్ | జూలై 19 బాన్సువాడ:  బహుజనుల వ్యతిరేక పార్టీలను ఓడించాలి: బీఎస్పీ నేత అడ్వకేట్ నిషాని రామచంద్రం...

More like this

కాంగ్రెస్ సర్కారుకు సోయి లేదు: కల్వకుంట్ల కవిత

ఎల్‌నినో హెచ్చరికలు ముందే తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి  సోయి లేదు: కల్వకుంట్ల కవిత మన భారత్, హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం కారణంగా...

బహుజన రాజ్యాధికారం రావాలి..

రాజ్యాధికారంతోనే అందరికీ సమాన హక్కులు సాధ్యం: బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రత్నాపురం రమేష్ మన భారత్, జైనథ్: జూలై 19 తెలంగాణ...

ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం..

మన భారత్, ఆదిలాబాద్ మన భారత్ |జూలై 19 తలమడుగు ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం.. 10 రోజుల పాటు 'SIR'...