నెలకు రూ.50 వేల జీతం.. మీరు అప్లై చేశారా.?

Published on

-Advertisement-

మన భారత్, జాబ్ న్యూస్: 

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన IDBI Bankలో మొత్తం 1,300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉండగా, ఈ నెల 19 వరకు అభ్యర్థులు ఆన్లైన్‌లో అప్లై చేసుకునే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావించే డిగ్రీ విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే నెలకు సుమారు రూ.50 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అర్హతలు: ఈ నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (Grade-O) పోస్టులకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.

అలాగే అసిస్టెంట్ మేనేజర్ (Grade-A) పోస్టులకు డిగ్రీతో పాటు బ్యాంకింగ్ రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండటం తప్పనిసరి.

వయో పరిమితి ..

అభ్యర్థుల వయసు 2026 మార్చి 1 నాటికి 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

వేతనం : ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు ప్యాకేజ్ ఇవ్వనున్నారు. అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి సమాచారం బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.

వెబ్‌సైట్:

https://www.idbi.bank.in

బ్యాంకింగ్ రంగంలో మంచి జీతంతో స్థిరమైన ఉద్యోగం కోరుకునే యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 

Latest articles

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

More like this

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...