మన భారత్, జాబ్ న్యూస్:
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకైన IDBI Bankలో మొత్తం 1,300 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై ఉండగా, ఈ నెల 19 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలని భావించే డిగ్రీ విద్యార్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలోనే నెలకు సుమారు రూ.50 వేల వరకు వేతనం లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అర్హతలు: ఈ నోటిఫికేషన్ ప్రకారం జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (Grade-O) పోస్టులకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు కావాలి.
అలాగే అసిస్టెంట్ మేనేజర్ (Grade-A) పోస్టులకు డిగ్రీతో పాటు బ్యాంకింగ్ రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండటం తప్పనిసరి.
వయో పరిమితి ..
అభ్యర్థుల వయసు 2026 మార్చి 1 నాటికి 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

వేతనం : ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల వరకు ప్యాకేజ్ ఇవ్వనున్నారు. అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర భత్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.

దరఖాస్తు విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, ఎంపిక విధానం వంటి సమాచారం బ్యాంకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది.
వెబ్సైట్:
బ్యాంకింగ్ రంగంలో మంచి జీతంతో స్థిరమైన ఉద్యోగం కోరుకునే యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
