రెండు రకాల పురుగుమందుల వాడకం ప్రమాదకరం.

Published on

-Advertisement-

మన భారత్ , ఆదిలాబాద్:

రైతులు రెండు రకాల పురుగు మందులను కలిపి వాడటం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బీసీఐ (BCI) మరియు కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు పురుగుమందుల సరైన వినియోగంపై వివరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రైతులు ఒకేసారి రెండు రకాల పురుగుమందులను కలిపి పిచికారీ చేయడం వల్ల పురుగులపై సరైన ప్రభావం ఉండదని తెలిపారు. అంతేకాకుండా రైతులకు ఖర్చులు కూడా అధికమవుతాయని చెప్పారు. అనవసరంగా పురుగుమందులు వాడడం వల్ల నేల సారానికి నష్టం కలగడమే కాకుండా పర్యావరణంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.

అధికంగా రసాయన పురుగుమందులు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమయ్యే ప్రమాదం ఉందని రైతులకు సూచించారు. రైతులు రసాయనాలపై ఆధారపడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.

అలాగే రైతులకు “క్యాలెండర్ స్ప్రే” మరియు “రాండమ్ స్ప్రే” పద్ధతుల మధ్య తేడాను వివరించి, అవసరమైనప్పుడు మాత్రమే పురుగుమందులు ఉపయోగించాలని అవగాహన కల్పించారు. పురుగుమందులు మరియు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అంకిత, స్వామి, సుభాష్ పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. గ్రామస్తులు, రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...