మాజీ సర్పంచ్ ముడుపు భూమారెడ్డి కన్నుమూత..

Published on

-Advertisement-

తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా:

తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ముడుపు భూమారెడ్డి (90) శనివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామ ప్రజలకు అండగా నిలిచి, అభివృద్ధి పనుల్లో ముందుండే నాయకుడిగా పేరు గాంచిన భూమారెడ్డి మరణ వార్త తెలిసి స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

భూమారెడ్డి గారు వరుసగా ఐదు పర్యాయాలు ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికై అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన నాయకత్వంలో బరంపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయి. తాగునీటి సదుపాయాలు, రహదారుల నిర్మాణం, విద్యా వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో ఆయన కృషి విశేషంగా నిలిచింది. గ్రామాభివృద్ధే తన లక్ష్యమని భావించి నిస్వార్థ సేవ అందించిన ప్రజానాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

మాజీ డీసీసీబీ ఛైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి  తండ్రిగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.

గ్రామ ప్రజలతో కలిసిమెలిసి పనిచేసిన ఆయన నాయకత్వం యువతకు ఆదర్శంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం భూమారెడ్డి  అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

గ్రామానికి విశేష సేవలందించిన భూమారెడ్డి  మరణంతో తలమడుగు మండలంలో శోకచ్ఛాయలు నెలకొన్నాయి.

Latest articles

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

More like this

వీజేఆర్ ఫౌండేషన్ సేవలు మరువలేనివి..

మన భారత్, నారాయణపేట: ఆత్మకూరు పట్టణంలోని ఆరవ వార్డులో నెలకొన్న త్రాగునీటి సమస్యకు వీజేఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాశ్వత పరిష్కారం...

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...