పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు.. భారీ వాహనాలకు నో ఎంట్రీ

Published on

-Advertisement-

మన భారత్, ఆదిలాబాద్:

పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రమాదాలను నివారించే ఉద్దేశ్యంతో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ బి. ప్రణయ్ కుమార్ తెలిపారు.

ఈ మేరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాలను పట్టణంలోకి అనుమతించబోమని వెల్లడించారు. రైల్వే అండర్ బ్రిడ్జి పనులు పూర్తయ్యే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని సూచించారు.

ప్రతిరోజు ఉదయం స్థానిక మావల వైపు నుండి వచ్చే వాహనాలు తిరుమల పెట్రోల్ బంక్ వరకు, అలాగే రైల్వే స్టేషన్ వరకు, ఆర్టీవో కార్యాలయం రైల్వే గేటు నుండి ‘ఐ లవ్ ఆదిలాబాద్’ వరకు పట్టణ పరిధిలో పూర్తిస్థాయి ఆంక్షలు అమల్లో ఉంటాయని వివరించారు.

ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ట్రాఫిక్ సీఐ బి. ప్రణయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Latest articles

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...

అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: సీఐ

తలమడుగులో 300 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత.. ఒకరి అరెస్ట్ తలమడుగు, ఆగస్టు 23: పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ (PDS)...

More like this

నిరుపేద విద్యార్థులకు అండగా బీఎస్పీ..

పేద విద్యార్థులకు బీఎస్పీ విద్యా సామగ్రి పంపిణీ ఆదిలాబాద్:మన భారత్ ఆగస్టు 24, పేద, నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో...

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర

బండారి కొమురయ్య సంవత్సరీకంలో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర మన భారత్,మొగుళ్ళపల్లి: మొగుల్లపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, తాపీ...

ప్లాట్ విక్రయిస్తానని రూ.5.70 లక్షలు వసూలు..

రియల్ ఎస్టేట్ ఏజెంట్ అరెస్ట్ ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 23: ప్లాట్ విక్రయిస్తానని నమ్మించి లక్షల రూపాయలు వసూలు...