విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల తగ్గింపు

Published on

-Advertisement-

మన భారత్ తెలంగాణ: 

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనున్నట్లు సమాచారం. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) తాజా ప్రతిపాదనల ప్రకారం కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను తగ్గించగా, అధిక శాతం కాలేజీలకు గతంలో అమలులో ఉన్న ఫీజులనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం సుమారు 10 నుంచి 15 కళాశాలల్లో పాత ఫీజులపై కోత విధించినట్లు సమాచారం. అదే సమయంలో 20 లోపు కళాశాలలకు 10 నుండి 15 శాతం వరకు స్వల్ప పెంపు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ ఫీజు నిర్మాణానికి సంబంధించిన దస్త్రం ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలనలో ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అధికారిక జీవో విడుదల కానుంది.

2025-28 బ్లాక్ పీరియడ్‌కు ఈ ఫీజు నిర్మాణం వర్తించేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు తుది ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.

Latest articles

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...

ట్రాఫిక్ సమస్యల నివారణకు కృషి..

మొగుళ్లపల్లి, మన భారత్: మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గ్రామపంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది....

More like this

బాటసారులకు శీతల జల సేవ..

వాంకిడి, మన భారత్: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బాటసారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాంకిడి మండల కేంద్రంలో సమతా...

సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయుల నిరసన..

ధన్వాడ, మన భారత్: తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ధన్వాడ...

షాపు యజమానులపై పంచాయతీ ఆగ్రహం..

మొగుళ్లపల్లి, మన భారత్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మద్యం షాపుల వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో...