విద్యార్థులకు గుడ్ న్యూస్.. కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల తగ్గింపు

Published on

-Advertisement-

మన భారత్ తెలంగాణ: 

తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు ఫీజుల విషయంలో ఊరట లభించనున్నట్లు సమాచారం. తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (TAFRC) తాజా ప్రతిపాదనల ప్రకారం కొన్ని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజులను తగ్గించగా, అధిక శాతం కాలేజీలకు గతంలో అమలులో ఉన్న ఫీజులనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం సుమారు 10 నుంచి 15 కళాశాలల్లో పాత ఫీజులపై కోత విధించినట్లు సమాచారం. అదే సమయంలో 20 లోపు కళాశాలలకు 10 నుండి 15 శాతం వరకు స్వల్ప పెంపు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం ఇంకా వెలువడాల్సి ఉంది.

ఈ ఫీజు నిర్మాణానికి సంబంధించిన దస్త్రం ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పరిశీలనలో ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అధికారిక జీవో విడుదల కానుంది.

2025-28 బ్లాక్ పీరియడ్‌కు ఈ ఫీజు నిర్మాణం వర్తించేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. విద్యార్థులు, తల్లిదండ్రులు తుది ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు.

Latest articles

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట..

బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన...

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.!

వెయ్యి రోజుల్లో అంతా మోసమే.. హామీల అమలు శూన్యం - కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ నారాయణపేట, మన భారత్ సెప్టెంబర్...

More like this

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

1000 రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ పోరుబాట..

బోథ్‌లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో భారీ ధర్నా.. 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీసిన...