🚨 ALERT: ఈ లింక్స్ అస్సలు క్లిక్ చేయకండి..

Published on

-Advertisement-

సైబర్ మోసాల పట్ల జాగ్రత్త.!

మన భారత్/ దేశవ్యాప్తంగా:

ఇటీవల రెండు రోజులుగా ‘PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్’ పేరిట రూ.5,000 పొందొచ్చంటూ వాట్సాప్ గ్రూపుల్లో ఓ సందేశం వేగంగా వైరల్ అవుతోంది. ఈ సందేశాల వెనుక సైబర్ కేటుగాళ్లు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమాయకులను మభ్యపెట్టి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడమే లక్ష్యంగా ఈ మోసాలు సాగుతున్నాయని వెల్లడించారు.

ఇదే తరహాలో తాజాగా SBI బ్యాంక్ పేరుతోనూ నకిలీ లింకులు, APK ఫైల్స్‌ను పంపిస్తూ ఖాతాలను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. “రూ.9,980 రివార్డ్ పాయింట్లు ఎక్స్‌పైరీ అవుతున్నాయి”, “రూ.5,000 గిఫ్ట్ మీ ఖాతాలో జమ అవుతుంది” వంటి ఆకర్షణీయమైన సందేశాలతో లింకులు పంపి, వాటిపై క్లిక్ చేయగానే మొబైల్ ఫోన్ నియంత్రణను సైబర్ నేరగాళ్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.

ఈ లింకుల ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చోరీ చేసి అకౌంట్ల నుంచి డబ్బులు దోచుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా APK ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేస్తే మొబైల్ పూర్తిగా హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.

సాధారణంగా బ్యాంకులు, డిజిటల్ పేమెంట్ యాప్స్ ఇలాంటి గిఫ్ట్ లింకులను వాట్సాప్ ద్వారా పంపవని గుర్తుంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అనుమానాస్పద లింక్స్, ఫైల్స్‌పై క్లిక్ చేయకుండా, అలాంటి సందేశాలను వెంటనే డిలీట్ చేయాలని సూచించారు. మోసపోయినట్లయితే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Latest articles

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...

అలెర్ట్.. 5 రోజులు వర్ష సూచన

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న ఐదు రోజులపాటు పలు...

More like this

ప్రతి గింజ కొనుగోలు చేయాలి: ఎమ్మెల్యే

మన భారత్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండల కేంద్రంలో మొక్కజొన్న రైతులకు ఉపశమనం కలిగించే విధంగా...

హైడ్రాను తొలగిస్తాం’.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన భారత్, తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్...

చిన్నారుల్లో విద్యా నైపుణ్యాల పెంపు..

మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల్లో విద్యా నైపుణ్యాలను పెంపొందించడంలో కీలక...