ఎల్లుండి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా..

Published on

-Advertisement-

ఎల్లుండి మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్  ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

మన భారత్, హైదరాబాద్:

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్‌ను ఈ నెల 4న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే చిరంజీవి చేతిలో గన్ పట్టుకున్న పోస్టర్‌ను విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కథకు తగ్గట్టుగా మాస్, ఎంటర్‌టైన్‌మెంట్ మిశ్రమంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో ప్రత్యేక ఆకర్షణగా కనిపించనున్నారు.

సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. భీమ్స్ సంగీతం అందించగా, ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ట్రైలర్ విడుదలతో సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ఫుల్ మాస్ అవతార్‌లో దర్శనమివ్వనున్నాడన్న వార్తతో అభిమానులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...