దారుణం… గర్భిణికి నిప్పంటించిన భర్త.!

Published on

-Advertisement-

కేరళలో దారుణం… గర్భిణిని నిప్పంటించిన భర్త!

మన భారత్ – క్రైమ్ డెస్క్,

కేరళ, మట్టుమల: రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తిన ఘోర ఘటన మట్టుమల ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. గర్భిణి మహిళ అర్చన మృతిపై మొదట ఆత్మహత్యగా అనుమానించిన పోలీసులు, దర్యాప్తు తర్వాత ఇది హత్యేనని తేల్చారు. కట్న వేధింపులు, ఇళ్లలో జరుగుతున్న హింస ఈ భయానక పరిణామానికి దారితీసిందని అర్చన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అర్చన మరణంపై ఆమె భర్త షారన్, అత్త రజిని, మరో కుటుంబ సభ్యుడిపై కేసు నమోదైంది. తొలుత అర్చన (గర్భవతి) ఆత్మహత్య చేసుకుందనే అభిప్రాయం వ్యక్తమైనా, పోలీసుల దర్యాప్తులో ఆమెను భర్త షారన్ తగలబెట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. వెంటనే పోలీసులు షారన్ను అదుపులోకి తీసుకున్నారు.

కట్నం కోసం కొనసాగుతున్న వేధింపులు అర్చన జీవితాన్ని నాశనం చేశాయని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు కారుస్తున్నారు. అత్తింటి వేధింపులకే అర్చన బలైందని వారు ఆరోపించారు. కేసు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...