ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.40 లక్షలు..

Published on

-Advertisement-

ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామానికి 40 లక్షలు ఇస్తా: బాల్డ్ యాదగిరి

మన భారత్, రాజాపేట: రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ఎన్నికల వేడి మొదలైన నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు వచ్చిన బాల్డ్ యాదగిరి కీలక ప్రకటన చేశారు. తాను సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధి కోసం తన వ్యక్తిగత నిధుల నుంచి ₹40 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తానని ఆయన ప్రకటించారు.

తనకు నలుగురు సంతానం ఉన్నప్పటికీ ప్రస్తుత సర్పంచ్ నిబంధనలు తనకు అనుకూలంగా ఉండటంతో ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్నట్లు యాదగిరి తెలిపారు. గ్రామ అభివృద్ధి పట్ల తనకున్న కట్టుబాటు వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

అన్ని పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు తన విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని ఏకగ్రీవానికి సహకరించాలని కోరుతున్నట్లు యాదగిరి చెప్పారు. గ్రామం మొత్తం అభివృద్ధి దిశగా తీసుకోబోయే సంకల్పాలకు ప్రజలు స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest articles

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

More like this

కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా..

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుండు సున్నా -వెయ్యి రోజుల సంబరాలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీలపై...

బీసీ మహిళా మంత్రి కొండా సురేఖకు ప్రోటోకాల్ వర్తించదా? రేవంత్ జీ

-సామాజిక న్యాయం అంటే ఇదేనా? రాహుల్ జీ -బీసీలను గౌరవించడమంటే బీసీ ప్రజా ప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించకపోవడమేనా? -ఫ్లెక్సీలో బీసీ మంత్రి...

బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే సమరభేరి డ్రామా

- కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము మన భారత్,మొగుళ్ళపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి...