“దేశం గర్వపడే విజయం” – సీఎం రేవంత్

Published on

-Advertisement-

నిఖత్ జరీన్ ‘పసిడి ప్రదర్శన’పై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటిన తెలంగాణ గర్వకిరీటం

మన భారత్, తెలంగాణ: వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్లో స్వర్ణ పతకం సాధించి భారత త్రివర్ణ పతాకాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన నిఖత్ జరీన్పై సీఎం ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు వెల్లువెత్తాయి. అద్భుత ప్రతిభ, దృఢ సంకల్పంతో ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్టను నలుదిశలా చాటిన నిఖత్ ప్రదర్శన అన్ని వర్గాల ప్రశంసలు పొందుతోంది.

“దేశం గర్వపడే విజయం” – సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో..నిఖత్ ప్రదర్శనపై హర్షం వ్యక్తం చేశారు. “ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటిన ఈ విజయంతో యువ క్రీడాకారులకు అపూర్వ స్ఫూర్తి లభిస్తుంది,” అని కొనియాడారు.నిఖత్ భవిష్యత్తులో మరిన్ని అగ్రశిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

తెలుగు జాతి గౌరవాన్ని ఖండాంతరాలు దాటించారు – మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా నిఖత్‌ను ప్రత్యేకంగా అభినందించారు.“తెలుగు జాతి గౌరవాన్ని నిఖత్ మరోసారి ఖండాంతరాలకు తీసుకెళ్లింది. ఆమె ధైర్యం, పట్టుదల ప్రతి క్రీడాకారుడికి ఆదర్శం,” అన్నారు.

భారత్ బాక్సింగ్‌కు నిఖత్ – స్ఫూర్తి శిఖరం

51 కిలోల విభాగంలో జువాన్ యి గువోపై 5-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించిన నిఖత్ విజయం భారత బాక్సింగ్ దాడిని మరింత బలోపేతం చేసింది. వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత మహిళలకు ఇది ఐదో స్వర్ణం కావడం ప్రత్యేకత.

#NikhatZareen #RevanthReddy #TelanganaPride#WorldBoxingCup #IndianSports

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...