42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల వైపు.?

Published on

-Advertisement-

పార్టీ ఆధారంగా 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికల వైపు? కాంగ్రెస్ కీలక నిర్ణయానికి రంగం సిద్ధం

మన భారత్ , హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు మరో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా ఎన్నికలకు వెళ్లాలని సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

బీసీ ఓటర్ల శక్తి, రాజకీయ ప్రభావం దృష్ట్యా రిజర్వేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆలోచన పార్టీ నాయకత్వంలో నెలకొంది. అయితే చట్టపరమైన రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాయి.

రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే కొనసాగుతుండటం, సంబంధిత బిల్లులు పెండింగ్‌లో ఉండటం, కౌన్సిల్ ఆమోదం లేకపోవడం వంటి అంశాల నేపథ్యంతో పార్టీ ఆధారంగానే రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశం బలపడుతోంది.

ఈ నేపథ్యంలో రేపు జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై కీలక చర్చ జరగనుందని, తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరమైన రిజర్వేషన్లు అమలులోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ రాజకీయ ప్రభావాన్ని చూపే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం.

 

 

#BCReservations #42PercentQuota #TelanganaPolitics #CongressGovernment #LocalBodyElections #PoliticalNews #ManaBharathCom

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...