మైథిలీ ఠాకూర్ మరో చారిత్రాత్మక రికార్డు..

Published on

-Advertisement-

మైథిలీ ఠాకూర్ మరో చారిత్రాత్మక రికార్డు

మన భారత్, బిహార్: పాటలతో కోట్ల మంది హృదయాలను గెలుచుకున్న మైథిలీ ఠాకూర్… ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా కొత్త చరిత్ర సృష్టించారు. బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఆమె మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.

భారతదేశంలో 21వ శతాబ్దంలో జన్మించి ఎమ్మెల్యే అయిన తొలి వ్యక్తిగా మైథిలీ ఠాకూర్ పేరు చరిత్రలో నిలిచిపోయింది. 2000 జూలై 25న జన్మించిన మైథిలీ, స్వతంత్ర భారత రాజకీయ చరిత్రలో కొత్త యుగాన్ని ప్రారంభించినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇప్పటి వరకు దేశంలోని ప్రతి MLA, MP 19వ లేదా 20వ శతాబ్దాల్లో జన్మించినవారే. 21వ శతాబ్దంలో జన్మించి ప్రజాస్వామ్య పోరులో అర్హత సాధించి గెలిచిన తొలి ప్రతినిధి మైథిలీ అవడం విశేషం. అంతేకాదు

ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా, మొదటిసారి పోటీ చేస్తూనే ఎమ్మెల్యే గా గెలవడం ఆమె విజయానికి మరింత ప్రాధాన్యం తెచ్చిపెట్టింది. యువత రాజకీయాల్లోకే కాదు, ప్రజాసేవలో వెలుగులు నింపగలరని మైథిలీ ఠాకూర్ నిరూపించారని విశ్లేషకుల అభిప్రాయం.

ప్రజలు ఇచ్చిన ఈ అపార మద్దతు తమ బాధ్యతను మరింతగా పెంచిందని మైథిలీ తెలిపారు. తాను ప్రజల కోసం, యువత కోసం, బీహార్ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు.

Latest articles

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...

రూ.7 లక్షలతో కల్వర్టు నిర్మాణానికి పూజ..

మన భారత్, తాంసి: గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో సీసీ కల్వర్టు నిర్మాణానికి...

More like this

Google ప్రపంచాన్ని మార్చిన టెక్ దిగ్గజం..

మన భారత్, ఇంటర్నేషనల్ : ప్రపంచ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సంస్థగా Google ప్రత్యేక గుర్తింపు పొందింది....

ఆపరేషన్ చేస్తుండగా వైద్యుడికి గుండెపోటు..

మన భారత్, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. సురేందర్ గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా...

ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్‌కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల...