ఎపిడ్యూరల్’ సేవలను అందుబాటులోకి తేవాలి

Published on

-Advertisement-

ప్రసవ నొప్పి తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘ఎపిడ్యూరల్’ అందుబాటులోకి తేవాలి: జాగృతి నాయకురాలు కవిత

మన భారత్, నిజామాబాద్: ప్రసవ సమయంలో మహిళలు ఎదుర్కొనే తీవ్రమైన నొప్పిని తగ్గించేందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ‘ఎపిడ్యూరల్’ సేవలను అందుబాటులోకి తేవాలని జాగృతి నాయకురాలు కవిత సూచించారు.

నిజామాబాద్‌లో నిర్వహించిన ” జనంబాట” (NLG) కార్యక్రమంలో మాట్లాడారు..“ప్రసవ సమయంలో ఆడబిడ్డలు భరించలేని నొప్పిని అనుభవిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం ‘ఎపిడ్యూరల్’ అనే మత్తు మందు ఇస్తారు. దాంతో మహిళలకు డెలివరీ సమయంలో నొప్పి తగ్గుతుంది.

ఇలాంటి సౌకర్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా అందుబాటులో ఉండాలి” అని మంత్రి రాజనర్సింహను కోరారు.

తదుపరి ఆమె భావోద్వేగంగా మాట్లాడుతూ..“BRS పాలనలో నేను ఈ ఆలోచన చేయకపోవడం నా తప్పు. ఆడబిడ్డలు నన్ను క్షమించాలి” అని తెలిపారు.

కవిత వ్యాఖ్యలు మహిళా ఆరోగ్య రంగంలో చర్చనీయాంశమయ్యాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఎపిడ్యూరల్ సదుపాయం ఉంటే పేద మహిళలకు విపరీతమైన ఉపశమనం లభిస్తుందని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...