ఎకరాకు రూ.10 వేలు కాదు.. రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి: కవిత

Published on

-Advertisement-

మత్తడి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ – కల్వల మత్తడి వద్ద రైతుల బాధలు తెలుసుకున్న జాగృతి అధ్యక్షురాలు

మన భారత్, కరీంనగర్, అక్టోబర్ 31: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రైతుల తరపున బలమైన స్వరం వినిపించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల మత్తడి వద్ద భారీ వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ఆమె, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..“రైతులు ఎకరాకు రూ. 10 వేలు కాకుండా ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించాలి” అని కవిత డిమాండ్ చేశారు.

మూడు సంవత్సరాల క్రితం కల్వల మత్తడి కొట్టుకుపోయిందని, దానిని మరమ్మతు చేసేందుకు అప్పటి ప్రభుత్వం రూ. 70 కోట్లు విడుదల చేస్తూ జీవో కూడా ఇచ్చిందని ఆమె గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం మారిన తరువాత ఆ పనులు నిలిచిపోయాయని విచారం వ్యక్తం చేశారు. హుజూరాబాద్, మానకొండూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కలిసి ఈ మత్తడి పునరుద్ధరణకు కృషి చేయాలని ఆమె కోరారు.

6 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్ట్ వల్ల వందలాది రైతు కుటుంబాలు బతుకుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈరోజు అవి కష్టాల్లో కూరుకుపోయాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణ రైతులందరూ తీవ్ర నష్టాన్ని చవిచూశారని, కాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్, ఖమ్మం జిల్లాలకు మాత్రమే పరిహారం ప్రకటించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “శంకరపట్నం రైతులు కూడా వరి పంటలు కోతకు సిద్ధం అయ్యే సమయంలో పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వం వీరిని కూడా గుర్తించాలి” అని అన్నారు.

“పంట చేతికొచ్చిన రైతులు ఇప్పుడు 25 శాతం దిగుబడికే పరిమితమయ్యారు. ఇది బాధాకరం. ప్రభుత్వం రైతుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించాలి,” అని కవిత హితవు పలికారు.

జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఫీల్డ్ అధికారుల ద్వారా పంట నష్టం లెక్కలు తీయాలని సూచించిన ఆమె, కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్రం తరఫున రైతులకు పరిహారం పొందేందుకు ప్రయత్నించాలన్నారు.

అటు కల్వల మత్తడి రిపేర్ పనులు ఆలస్యం కాకుండా వెంటనే పూర్తి చేయాలని ఆమె ప్రభుత్వం, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆధారపడి ఉన్న దాదాపు 180 ముదిరాజ్ కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోకుండా కాపాడాలని కవిత కోరారు.

“రైతు లేనిదే రాజ్యం లేదు. ఆ మాటకు అర్ధం ఇవ్వాలంటే రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి,” అంటూ కవిత తన పర్యటనను ముగించారు.

Latest articles

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...

కొత్త పెన్షన్ల దరఖాస్తు గడువు పొడిగింపు..

సెప్టెంబర్ 15 వరకు అవకాశం.. ఇప్పటికే 4.50 లక్షల దరఖాస్తులు మరొక అవకాశం కల్పించాలని వచ్చిన విజ్ఞప్తులతో ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్:...

More like this

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి : డీఎస్పీ సంపత్ రావు

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పని చేయాలి -డీఎస్పీ సంపత్ రావు మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేలా పనిచేయాలని...

గిరిజనుల అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి: ఎమ్మెల్యే

వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ ప్రాంత ప్రజల హక్కులకు ప్రాధాన్యం పర్యావరణ పరిరక్షణతోపాటు గిరిజనుల జీవనోపాధి, అభివృద్ధి అవసరం: ఎమ్మెల్యే...

ఒకే బస్సుతో ప్రయాణికులకు పరేషాన్.!

తలమడగు–కోసాయి మార్గంలో అదనపు బస్సులు నడపాలని ప్రయాణికుల డిమాండ్ తలమడుగు, ఆగస్టు 31: తలమడుగు మండల కేంద్రం నుంచి కోసాయి...