చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ

Published on

-Advertisement-

చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ – అనుమతి లేకుండా పేరు, ఫోటోలు వాడరాదని ఆదేశం

మన భారత్, హైదరాబాద్: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్, లేదా ఏ విధమైన వ్యక్తిగత గుర్తింపులను అనుమతి లేకుండా వాడరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యక్తిత్వం, ప్రచార హక్కులు దుర్వినియోగమవుతున్నాయంటూ చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం కోర్టు ఆయన పక్షాన తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఏ వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్, లేదా గుర్తించదగిన ఇతర అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన అనుమతి లేకుండా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా ‘మెగాస్టార్’, ‘చిరు’, ‘అన్నయ్య’ వంటి పేర్లను ఉపయోగించి ఏఐ మార్ఫింగ్ లేదా డిజిటల్ వేదికలపై దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. టీఆర్పీ , లాభాల కోసం చిరంజీవి పేరు, రూపం, వాయిస్‌ను వాడిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించిన 30 మందికి నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.ఈ తీర్పుతో సినీ పరిశ్రమలో ప్రముఖుల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై కొత్త చర్చ ప్రారంభమైంది.

Latest articles

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...

ఆటో డ్రైవర్ భార్య అద్భుత ప్రతిభ.!

ఆంధ్రప్రదేశ్, ఆదోని, మన భారత్: ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చని మరోసారి నిరూపించారు కర్నూల్ జిల్లా...

More like this

హిందూ సమ్మేళనానికి సన్నాహాలు..

మన భారత్, ఉట్నూర్: ఉట్కూర్ ఖండంలోని ఎక్లాస్పూర్ ఉపమండలంలో హిందూ సమ్మేళనం నిర్వహణకు ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ నేపథ్యంలో హిందూ...

ఇన్విజిలేటర్లకు విందు పేరుతో వసూళ్లు..!

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి మండలంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు విందు ఏర్పాటు పేరుతో పాఠశాలల నుంచి నగదు...

ఆ సభకు ప్రజా ప్రతినిధుల డుమ్మా ..!

మన భారత్, ఆదిలాబాద్ (తాంసి): తాంసి మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి...