చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ

Published on

-Advertisement-

చిరంజీవి వ్యక్తిత్వ హక్కులకు సిటీ సివిల్ కోర్టు రక్షణ – అనుమతి లేకుండా పేరు, ఫోటోలు వాడరాదని ఆదేశం

మన భారత్, హైదరాబాద్: ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్, లేదా ఏ విధమైన వ్యక్తిగత గుర్తింపులను అనుమతి లేకుండా వాడరాదని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన వ్యక్తిత్వం, ప్రచార హక్కులు దుర్వినియోగమవుతున్నాయంటూ చిరంజీవి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం కోర్టు ఆయన పక్షాన తాత్కాలిక ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, ఏ వ్యక్తి లేదా సంస్థ చిరంజీవి పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్, లేదా గుర్తించదగిన ఇతర అంశాలను వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన అనుమతి లేకుండా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. అదేవిధంగా ‘మెగాస్టార్’, ‘చిరు’, ‘అన్నయ్య’ వంటి పేర్లను ఉపయోగించి ఏఐ మార్ఫింగ్ లేదా డిజిటల్ వేదికలపై దుర్వినియోగం చేయరాదని హెచ్చరించింది. టీఆర్పీ , లాభాల కోసం చిరంజీవి పేరు, రూపం, వాయిస్‌ను వాడిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఆయన వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించిన 30 మందికి నోటీసులు జారీ చేయగా, తదుపరి విచారణను అక్టోబర్ 27కి వాయిదా వేసింది.ఈ తీర్పుతో సినీ పరిశ్రమలో ప్రముఖుల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై కొత్త చర్చ ప్రారంభమైంది.

Latest articles

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...

అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి

గ్రామస్థాయి నుండి అంబేద్కర్ సంఘాన్ని బలోపేతం చేయాలి మన భారత్, మొగుళ్ళపల్లి: మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత,...

More like this

అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

మన భారత్, ఆదిలాబాద్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, జూలై 18: జిల్లాలో...

టీఆర్ఎస్ మండల అధ్యక్షుడిగా బానోత్ వసంత్‌ రావు..

నేరడిగొండ మండల బాధ్యుడిగా బానోత్ వసంత్‌రావు.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాథోడ్ బాపూరావు...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పర్యటన వివరాలు..

క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి.. ఇస్కాన్ ఆధ్వర్యంలోని తొలి జగన్నాథ రథయాత్రలో పాల్గొననున్న ఎమ్మెల్యే మన భారత్, జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గ...