ఆపదలో ప్రజలకు తొలి భరోసా పోలీసులే..

Published on

-Advertisement-

డయల్-112 ఫిర్యాదులపై క్షణాల్లో స్పందించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి

గంజాయి, పేకాట, నకిలీ విత్తనాలు, అక్రమ రేషన్ బియ్యంపై కఠిన చర్యలకు ఆదేశం

ఆదిలాబాద్, ఆగస్టు 6 (మన భారత్): ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసు వ్యవస్థేనని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సేవాభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ సూచించారు. అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన డయల్-112 కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై క్షణాల్లో స్పందించి బాధితులకు తక్షణ రక్షణ కల్పించాలని ఆదేశించారు.

గురువారం ఆదిలాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో డయల్-112, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందితో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు నాణ్యమైన అత్యవసర సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ఫిర్యాదు అందిన వెంటనే బాధితులకు భరోసా కల్పించాలి

డయల్-112కు కాల్ వచ్చిన వెంటనే బాధితులను ఫోన్ ద్వారా సంప్రదించి పోలీసులు సంఘటనా స్థలానికి బయలుదేరారని ధైర్యం చెప్పాలని ఎస్పీ సూచించారు. వీలైనంత తక్కువ సమయంలో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు బాధితులకు అవసరమైన సహాయం అందించాలని తెలిపారు. సమస్య పరిష్కారమైన తర్వాత నిర్దేశిత విధానంలో అన్ని వివరాలను నమోదు చేసి వ్యవస్థలో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు.

గ్రామాలు, పట్టణాల్లో నిరంతర పర్యవేక్షణ

ప్రతి పోలీసు బృందం గ్రామాలు, పట్టణాల్లో నిరంతరం పర్యటిస్తూ స్థానిక సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాలు, మహిళల భద్రత, సీసీటీవీల ప్రాధాన్యత, ప్రస్తుత నేరాల ధోరణులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు.

అలాగే “పోలీసు మీకోసం” కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను పెంపొందించాలని సూచించారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం

జిల్లాలో పేకాట, గంజాయి విక్రయాలు, అక్రమ ప్రభుత్వ రేషన్ బియ్యం రవాణా, నకిలీ విత్తనాలు, కల్తీ పురుగుమందుల విక్రయాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. పక్కా సమాచారాన్ని సేకరించి నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

రాత్రి వేళల్లో తనిఖీలు మరింత ముమ్మరం

రాత్రి సమయంలో ఫింగర్‌ప్రింట్ పరికరాలతో అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయాలని, చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు పాయింట్ బుక్స్‌ను నిరంతరం పరిశీలిస్తూ నేర నియంత్రణకు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.

ప్రజల విశ్వాసమే పోలీసు వ్యవస్థకు బలం

పోలీసు వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేయడం ప్రతి పోలీసు సిబ్బంది బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. విధుల్లో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ, సేవాభావంతో వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి సమస్య తీవ్రత పెరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఉత్తమ సేవలకు ప్రశంసలు

విధుల్లో విశేష ప్రతిభ కనబరిచిన డయల్-112, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు. ఇలాంటి సేవా దృక్పథంతో ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.

ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, డీసీఆర్‌బీ ఎస్ఐ ప్రవీణ్, కమ్యూనికేషన్ ఎస్ఐ గణేష్, డయల్-112, బ్లూ కోల్ట్, పెట్రోల్ కార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి 

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఉద్యోగం పేరుతో రూ.2.06 లక్షల మోసం

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం పేరుతో రూ.2.06 లక్షల మోసం నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 24:...

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి..

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా విధానం తీసుకురావాలి. టీఆర్‌పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రభుత్వ...

ఈ నెల 27న గ్రామ వార్డు సభలు షురూ..

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, ఆగస్టు 24: ఓటరు జాబితా...

ఆదివాసీల సమస్యల పరిష్కారానికి చట్టపర చర్యలు

నిబంధనల ప్రకారం పరిష్కరిస్తాం: ఐటీడీఏ పీవో మకరందు ఉట్నూర్, మన భారత్ ఆగస్టు 24: ఆదివాసీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన సమస్యలను...

More like this

ఉద్యోగం పేరుతో రూ.2.06 లక్షల మోసం

ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం పేరుతో రూ.2.06 లక్షల మోసం నిందితుడు అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు ఆదిలాబాద్, మన భారత్, ఆగస్టు 24:...

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలి..

ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా విధానం తీసుకురావాలి. టీఆర్‌పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ మన భారత్,మొగుళ్ళపల్లి: ప్రభుత్వ...

ఈ నెల 27న గ్రామ వార్డు సభలు షురూ..

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్ రాజర్షి షా ఆదిలాబాద్, ఆగస్టు 24: ఓటరు జాబితా...