ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా విధానం తీసుకురావాలి.
టీఆర్పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్
మన భారత్,మొగుళ్ళపల్లి:
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కేవలం నిధులు కేటాయించడం సరిపోదని, ప్రభుత్వ పాఠశాలలపై పాలకులు, అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజల్లో విశ్వాసం పెరిగేలా ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీఆర్పీ మొగుళ్లపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ అన్నారు.ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివేలా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే, ఆయా పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, ఉపాధ్యాయుల పనితీరు, మౌలిక వసతులు, డిజిటల్ విద్య, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతతో దృష్టి సారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రభుత్వ పాఠశాలలు కేవలం పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లల కోసం మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వర్గానికి నాణ్యమైన విద్య అందించే కేంద్రాలుగా మారాలని రాజేష్ అన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకే విద్యా వ్యవస్థలో చదివే పరిస్థితి ఏర్పడితే సామాజిక సమానత్వం, సమాన విద్యా అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వ విద్యపై ప్రజల్లో విశ్వాసం మరింత బలపడుతుందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతిక సదుపాయాలు, మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రమైన వాతావరణం, తాగునీరు, అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలు నాణ్యమైన విద్యకు ఆదర్శంగా నిలిస్తే ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడే పరిస్థితి తగ్గి, విద్య కోసం తల్లిదండ్రులు భరించాల్సిన ఆర్థిక భారం కూడా తగ్గుతుందని అన్నారు.ధనిక–పేద, ఉద్యోగి–కూలీ అనే తేడా లేకుండా ప్రతి విద్యార్థికి సమానమైన, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని బోనగిరి రాజేష్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా విధానపరమైన నిర్ణయం తీసుకుని, దాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మీ పవన్ కళ్యాణ్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
