కుచులాపూర్-4 అంగన్వాడీలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహణ
చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్
మన భారత్,ఆగస్టు 6 తలమడుగు:
తలమడుగు మండలంలోని కుచులాపూర్-4 అంగన్వాడీ కేంద్రంలో జాతీయ తల్లిపాల వారోత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, శిశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, తల్లుల్లో పోషకాహారంపై చైతన్యం కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. అనంతరం ఆరోగ్య శాఖ సిబ్బంది చిన్నారులకు ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఐరన్ సిరప్ అందజేశారు. చిన్నారుల ఎదుగుదలలో పోషకాహారం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, అవసరమైన టీకాలు ఎంతో ముఖ్యమని తల్లిదండ్రులకు వివరించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది మాట్లాడుతూ, పుట్టిన శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, శారీరక, మానసిక ఎదుగుదలకు తల్లిపాలు అత్యంత అవసరమని తెలిపారు. అనంతరం గర్భిణులు, బాలింతలకు సమతుల్య ఆహారం తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి తల్లి, ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్సీ సిబ్బంది, గ్రామ ప్రజలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
