కుమార్తె తొలి వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అన్నదానం.. సేవా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
తలమడుగు, జూలై 28 (మన భారత్): తలమడుగు మండలంలోని సుంకిడి వృద్ధాశ్రమంలో హృదయాన్ని హత్తుకునే సేవా కార్యక్రమం నిర్వహించారు. కజ్జర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెట్ట పూర్ణచందర్ తన పెద్ద కుమార్తె మానస తొలి వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ప్రేమతో భోజనాలు వడ్డించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు మానస జ్ఞాపకాలను స్మరించుకుంటూ, సమాజ సేవ ద్వారా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మానవీయ విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.
అన్నదాన కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్ సర్పంచులు వై. నారాయణ రెడ్డి, డి. పొచ్చన్న, మాజీ ఎంపీటీసీ స్వామి, మార్కెట్ డైరెక్టర్ ఎం. పోశెట్టి, ఎల్. ప్రవీణ్ రెడ్డి, జి. సాంబశివ్, తిరుపతి, ప్రఫుల్ రెడ్డి తో పాటు కజ్జర్ల గ్రామానికి చెందిన పలువురు నాయకులు, గ్రామస్తులు హాజరై మానస చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, మరణించిన వారి జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప సంప్రదాయమని కొనియాడారు. వృద్ధులను ఆదుకోవడం, వారికి ఆప్యాయతను పంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
వృద్ధాశ్రమ నిర్వాహకులు మెట్ట పూర్ణచందర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వృద్ధుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
