వర్షపాత పరిస్థితులను గమనించి పంటల సాగు చేపట్టాలి: వ్యవసాయ అధికారులు
తలమడుగు మన భారత్, జూలై 24: ఎల్నినో ప్రభావంతో వర్షపాతంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచించారు. వర్షాలకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, సాగులో ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
శుక్రవారం తలమడుగు మండలంలోని పల్లి బి గ్రామ పంచాయతీ భవనంలో రైతులకు ఎల్నినో ప్రభావం, వర్షపాత పరిస్థితులు, వ్యవసాయంపై వాటి ప్రభావం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా వర్షాలు ఆలస్యం కావడం లేదా తక్కువగా కురిసే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
రైతులు తొందరపడి పంటలు వేసుకోకుండా వర్షపాతం పరిస్థితులను అంచనా వేసుకుని సాగు చేపట్టాలని సూచించారు. పంటల ఎంపికలో స్థానిక వాతావరణ పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని సూచించారు.
అలాగే వ్యవసాయ శాఖ అధికారులు అందించే సూచనలు, వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కోరారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైతే పంటలకు నష్టం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవసాయ పనులు చేపట్టాలని అధికారులు సూచించారు.
రైతుల సందేహాలను అధికారులు నివృత్తి చేసి, ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడే వాతావరణ మార్పులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పల్లి బి గ్రామ సర్పంచ్ కటకం సంజీవ్, ఉప సర్పంచ్ కొరంగాల మారుతి, గ్రామ కార్యదర్శి బాలాజీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి.
జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
