వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్డు.. తెగిపోయిన వంతెన….!

Published on

-Advertisement-

వర్షాలకు దెబ్బతిన్న బీటీ రోడ్డు.. తెగిపోయిన వంతెన….!

లక్ష్మీపూర్–లచ్చంపూర్ ప్రధాన రహదారికి తక్షణ మరమ్మతులు చేపట్టాలని ప్రజల విజ్ఞప్తి

మన భారత్, తలమడుగు:

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్–లచ్చంపూర్ ప్రధాన రహదారి గత నెలలో కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు మార్గమధ్యంలోని వంతెన కూడా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే గ్రామస్థులు, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ రాకపోకలు ప్రమాదకరంగా మారడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాల కారణంగా బీటీ రోడ్డు పలు చోట్ల గుంతలమయంగా మారగా, వంతెన దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారులను ఆసుపత్రులకు తరలించడం కూడా కష్టసాధ్యంగా మారిందని గ్రామస్తులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించడం మరింత ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు.

గ్రామస్తులు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు గ్రామాలకు వచ్చి హామీలు ఇస్తున్నారని, ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారి దెబ్బతిని నెలలు గడుస్తున్నా మరమ్మతులు ప్రారంభం కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాధా మనోహర్ మాట్లాడుతూ, లక్ష్మీపూర్–లచ్చంపూర్ రహదారి, దెబ్బతిన్న వంతెన సమస్యను ఇప్పటికే బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్య తీవ్రతను ఎమ్మెల్యేకు వివరించగా, సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా మరమ్మత్తు పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

అయితే వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో ఆలస్యం చేయకుండా తక్షణమే రహదారి, వంతెన మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు సురక్షిత రాకపోకలు కల్పించాలని గ్రామ పెద్దలు, యువత, రైతులు, మహిళలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడక ముందే అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్

ఆదిలాబాద్ జిల్లాలో పని చేయుటకు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...

నకిలీ రూ.500 నోటు కలకలం..

ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ రూ.500 నోటు కలకలం బ్యాంకులో గుర్తించిన అధికారులు.. నగదు లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన మన భారత్, ఆసిఫాబాద్: కొమురం...

More like this

స్కూల్ హోమ్‌వర్క్ వివాదంపై ఎన్‌హెచ్‌ఆర్సీ సీరియస్

'కల్మా' హోమ్‌వర్క్ అంశంపై హైదరాబాద్ కలెక్టర్, సీపీ, విద్యాశాఖ అధికారులకు నోటీసులు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం మన...

గ్రామ పంచాయతీలకు శుభవార్త..

ఆర్థిక స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం కీలక నిర్ణయం పంచాయతీరాజ్ చట్టంలో సవరణకు రంగం సిద్ధం.. గ్రామాభివృద్ధి పనులకు నిధుల వినియోగం...

మీరు రిపోర్టర్ కావాలని అనుకుంటున్నారా.!

రిపోర్టర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? ఇదే మీకు సువర్ణావకాశం! సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకురావాలనే ఆసక్తి ఉన్న వారికి 'మన భారత్'లో...