మన భారత్ | ఆదిలాబాద్
మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ నేటి కార్యక్రమాలు
ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి, ప్రజారోగ్యం, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష సతీష్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
ఉదయం 7.30 గంటలకు వార్డు నంబర్ 9లో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వెనుక భాగంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించనున్నారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి, పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
అనంతరం ఉదయం 8.00 గంటలకు హమాలివాడ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేయించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
తదుపరి ఉదయం 8.15 గంటలకు భుక్తాపూర్లో నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని తల్లిదండ్రులు ప్రతి ఐదేళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని అవగాహన కల్పించనున్నారు.
ఉదయం 9.00 గంటలకు జెడ్పీ హాల్లో నిర్వహించే నృత్య ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కళాకారులను అభినందించనున్నారు.
అనంతరం ఉదయం 10.00 గంటల నుంచి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే పలు అభివృద్ధి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలుసుకోనున్నారు.
మున్సిపల్ చైర్పర్సన్ పర్యటన సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక నాయకులు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
