మిత్రా సేవా సొసైటీ ఔదార్యం..

Published on

-Advertisement-

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ ఆర్థిక సహాయం

పశువుల కొట్టం దగ్ధం.. ఐదు గేదెలు సజీవ దహనం

– బాధిత కుటుంబానికి అండగా నిలిచిన సంఘం

మన భారత్, బోరజ్:

భోరజ్ మండలంలోని గూడ గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఉశ్కమల్ల కృష్ణకు చెందిన పశువుల పాక (కొట్టం) పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పశుగ్రాసం (సొప్ప, కుటారు), వ్యవసాయ పనిముట్లు, పైపులు తదితర సామగ్రితో పాటు ఐదు గేదెలు (బర్రెలు) సజీవ దహనమై మృతి చెందాయి. దీంతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది.

ఈ విషయం తెలుసుకున్న మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ అధ్యక్షులు, తాలూకా మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు తోట శివ్వన్న, మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ ప్రధాన కార్యదర్శి బొల్లు ఈశ్వర్ దాస్ కలిసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు ఉశ్కమల్ల కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, మనోధైర్యాన్ని కల్పించారు. బాధిత కుటుంబానికి తమవంతు సహాయంగా మున్నూరుకాపు మిత్రా సేవా సొసైటీ తరఫున రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.

సామాజిక బాధ్యతలో భాగంగా బాధితులకు అండగా నిలిచామని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఇలాంటి కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, మున్నూరుకాపు సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

మున్సిపల్ ఛైర్పర్సన్ నేటి పర్యటన వివరాలు..

మన భారత్ | ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ నేటి కార్యక్రమాలు ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి, ప్రజారోగ్యం, సాంస్కృతిక...

కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం..

ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బీఎల్‌ఏ-2 సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు మంత్రుల దిశానిర్దేశం ఇందిరమ్మ ఇండ్లు, మైనార్టీ పాఠశాలల ప్రారంభోత్సవాల్లో...

11 నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టివేత..

నకిలీ విత్తనాల విక్రయంపై జైనథ్ పోలీసుల మెరుపు దాడి మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్న ఇద్దరు...

Sir పక్రియ వేగవంతం చేయాలి

పల్లీ (బి) గ్రామంలో SIR కార్యక్రమం నిర్వహణ BLA, MRO, BLOలతో కలిసి గ్రామంలో అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మన...

More like this

మున్సిపల్ ఛైర్పర్సన్ నేటి పర్యటన వివరాలు..

మన భారత్ | ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్ నేటి కార్యక్రమాలు ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధి, ప్రజారోగ్యం, సాంస్కృతిక...

కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి దిశానిర్దేశం..

ఆదిలాబాద్‌లో అభివృద్ధి పనులకు శ్రీకారం.. బీఎల్‌ఏ-2 సమావేశంలో కాంగ్రెస్ శ్రేణులకు మంత్రుల దిశానిర్దేశం ఇందిరమ్మ ఇండ్లు, మైనార్టీ పాఠశాలల ప్రారంభోత్సవాల్లో...

11 నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టివేత..

నకిలీ విత్తనాల విక్రయంపై జైనథ్ పోలీసుల మెరుపు దాడి మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్న ఇద్దరు...