కిడ్నాప్ యత్నం కేసులో ఇద్దరు అరెస్ట్..

Published on

-Advertisement-

జైనథ్ పోలీసుల చాకచక్యంతో నిందితుల పట్టివేత

జైనథ్, మన భారత్:

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో మహిళను మోసపూరితంగా తీసుకెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జైనథ్ సీఐ జి. శ్రావణ్ వెల్లడించారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళను నమ్మించి బైక్‌పై తీసుకెళ్లి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన జైనథ్ పోలీసులు నిందితులు అశోక్ భూమన్న బట్టవార్, సంజీవ్ నాగోరావ్ నవలేలను గుర్తించి అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి కిడ్నాప్ యత్నానికి ఉపయోగించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

ప్రజలు ముఖ్యంగా మహిళలు అపరిచిత వ్యక్తులను నమ్మే విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఐ జి. శ్రావణ్ సూచించారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు ఎదురైనా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

Latest articles

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...

532 గ్రాముల ఎండు గంజాయి స్వాధీనం..

ఎండు గంజాయి స్వాధీనం మొగుళ్లపల్లి, ఆగస్టు 13: అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్న యువకుడిని మొగుళ్లపల్లి పోలీసులు అరెస్టు చేసి,...

More like this

ఆ గ్రామానికి జిల్లా కలెక్టర్ పేరు..!

ఆ గ్రామానికి ఆదిలాబాద్ కలెక్టర్ పేరు ఆదిలాబాద్ రూరల్, ఆగస్టు 13: గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ...

ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు

ఎన్టీఆర్ చౌరస్తాలో ఫుట్‌పాత్ తొలగింపుపై ఫిర్యాదు ఆదిలాబాద్, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

కప్పర్లలో కేమా సదానందం కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పరామర్శ తాంసీ, ఆగస్టు 13, మన భారత్: ఆదిలాబాద్...