మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: SI గణేష్

Published on

-Advertisement-

బంగారు ఆభరణాల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి

మన భారత్, విజయనగరం: 

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని తంగుడబిల్లి గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులతో నెల్లిమర్ల ఎస్సై గణేష్ సమావేశం నిర్వహించి మహిళల భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వేసవికాలంలో చాలామంది ఇంటి పైకప్పులపై నిద్రిస్తున్న సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

అలాగే ఈవ్‌టీజింగ్, వేధింపులు లేదా మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులకు, మహిళలకు సూచించారు. మహిళల రక్షణ, భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్సై గణేష్ స్పష్టం చేశారు.

సమాజంలో మహిళలకు చట్టపరంగా అనేక రకాల రక్షణలు ఉన్నాయని, ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా పోలీస్ స్టేషన్, 112 అత్యవసర హెల్ప్‌లైన్ లేదా 181 మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లో “శక్తి యాప్” డౌన్‌లోడ్ చేసుకుని అవసర సమయంలో ఉపయోగించుకోవాలని సూచించారు.

అలాగే ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై కూడా శ్రద్ధ వహించాలని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం

మన భారత్ | తలమడుగు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వందలాది మందికి కంటి వైద్య సేవలు ఆదిలాబాద్ జిల్లా...

ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం..

మన భారత్ | తలమడుగు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా...

రైతులకు న్యాయం జరగకపోతే రోడ్డెక్కుతాం: ఎమ్మెల్యే

మన భారత్ | భీంపూర్ జొన్న రైతులతో కలిసి భోజనం.. కొనుగోలు కేంద్రంలో సమస్యలపై ఆరా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల...

ఎమ్మెల్యేకు కష్టాలు చెప్పి కంటతడి పెట్టిన రైతు..

మన భారత్ | తాంసి జొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే.. కొనుగోలు కేంద్రంలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం ఆదిలాబాద్ జిల్లా...

More like this

ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం

మన భారత్ | తలమడుగు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వందలాది మందికి కంటి వైద్య సేవలు ఆదిలాబాద్ జిల్లా...

ఉచిత ఆరోగ్య పరీక్షల శిబిరం..

మన భారత్ | తలమడుగు గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సేవలు.. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు ఆదిలాబాద్ జిల్లా...

రైతులకు న్యాయం జరగకపోతే రోడ్డెక్కుతాం: ఎమ్మెల్యే

మన భారత్ | భీంపూర్ జొన్న రైతులతో కలిసి భోజనం.. కొనుగోలు కేంద్రంలో సమస్యలపై ఆరా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల...