మహిళల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యం: SI గణేష్

Published on

-Advertisement-

బంగారు ఆభరణాల విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలి

మన భారత్, విజయనగరం: 

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని తంగుడబిల్లి గ్రామంలో ఉపాధి హామీ శ్రామికులతో నెల్లిమర్ల ఎస్సై గణేష్ సమావేశం నిర్వహించి మహిళల భద్రత, దొంగతనాల నివారణపై అవగాహన కల్పించారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఒంటరిగా బయటకు వెళ్లే మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. మహిళలు బయటకు వెళ్లేటప్పుడు బంగారు ఆభరణాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వేసవికాలంలో చాలామంది ఇంటి పైకప్పులపై నిద్రిస్తున్న సమయంలో ఇళ్లలో దొంగతనాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు.

అలాగే ఈవ్‌టీజింగ్, వేధింపులు లేదా మహిళలపై హింసాత్మక ఘటనలు జరిగితే మౌనంగా ఉండకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులకు, మహిళలకు సూచించారు. మహిళల రక్షణ, భరోసా కల్పించడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని ఎస్సై గణేష్ స్పష్టం చేశారు.

సమాజంలో మహిళలకు చట్టపరంగా అనేక రకాల రక్షణలు ఉన్నాయని, ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా పోలీస్ స్టేషన్, 112 అత్యవసర హెల్ప్‌లైన్ లేదా 181 మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రతి మహిళ తమ మొబైల్ ఫోన్‌లో “శక్తి యాప్” డౌన్‌లోడ్ చేసుకుని అవసర సమయంలో ఉపయోగించుకోవాలని సూచించారు.

అలాగే ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై కూడా శ్రద్ధ వహించాలని, తగినంత నీరు తాగుతూ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

ఆవిర్భావ వేడుకల సమావేశాన్ని విజయవంతం చేయాలి..

అంబేద్కర్ యువజన సంఘం 50వ ఆవిర్భావ వేడుకల సన్నాహక రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలి రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, మేధావులు,...

చట్టాలపై అవగాహన అవసరం.!

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: టౌన్ సీఐ కె. నారాయణరావు  వెలగవలస గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు మన భారత్...

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..

బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | ఆదిలాబాద్ | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..

మన భారత్ | ఆదిలాబాద్  సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్  ఏపీకే ఫైల్స్,...

More like this

ఆవిర్భావ వేడుకల సమావేశాన్ని విజయవంతం చేయాలి..

అంబేద్కర్ యువజన సంఘం 50వ ఆవిర్భావ వేడుకల సన్నాహక రాష్ట్ర సమావేశాన్ని విజయవంతం చేయాలి రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ వాదులు, మేధావులు,...

చట్టాలపై అవగాహన అవసరం.!

చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి: టౌన్ సీఐ కె. నారాయణరావు  వెలగవలస గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు మన భారత్...

విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి..

బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తుల విజ్ఞప్తి మన భారత్ | ఆదిలాబాద్ | తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని...