బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్లపల్లి

బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదు: వేముల మహేందర్ గౌడ్

జనగణనలో కులగణన చేయడానికి అభ్యంతరం ఏంటి? అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని చెప్పుకుంటూనే, బీసీల హక్కులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు జనగణనలో సమగ్ర కులగణన నిర్వహించకపోవడం ద్వారా బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. దేశ జనాభాలో అధిక శాతం బీసీలే ఉన్నారని, వారికి రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో బీసీలంతా ఏకమై బీజేపీకి గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బీజేపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు బీసీల పట్ల వ్యతిరేక వైఖరే కొనసాగుతోందని, మండల్ ఉద్యమం నుంచి కులగణన ఉద్యమం వరకు అదే ధోరణి కొనసాగుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి ..

Latest articles

బీజేపీ.. “అమ్మ పేరిట ఒక మొక్క”

ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు ‘అమ్మ పేరిట ఒక మొక్క’ కార్యక్రమంలో బీజేపీ...

డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో...

ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!

స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్,...

బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి ఘన వీడ్కోలు..

ప్రజల మనసులు గెలుచుకున్న పోలీస్ అధికారి సేవలకు ప్రశంసల వెల్లువ మన భారత్, నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో...

More like this

బీజేపీ.. “అమ్మ పేరిట ఒక మొక్క”

ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు ‘అమ్మ పేరిట ఒక మొక్క’ కార్యక్రమంలో బీజేపీ...

డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో...

ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!

స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్,...