బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీ..

Published on

-Advertisement-

మన భారత్, మొగుళ్లపల్లి

బీసీలకు ద్రోహం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదు: వేముల మహేందర్ గౌడ్

జనగణనలో కులగణన చేయడానికి అభ్యంతరం ఏంటి? అంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీలకు అన్యాయం చేస్తున్న బీజేపీకి రాజకీయ పతనం తప్పదని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అని చెప్పుకుంటూనే, బీసీల హక్కులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు జనగణనలో సమగ్ర కులగణన నిర్వహించకపోవడం ద్వారా బీసీలను మోసం చేసిందని ఆరోపించారు. దేశ జనాభాలో అధిక శాతం బీసీలే ఉన్నారని, వారికి రాజకీయ, ఆర్థిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో బీసీలంతా ఏకమై బీజేపీకి గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

బీజేపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు బీసీల పట్ల వ్యతిరేక వైఖరే కొనసాగుతోందని, మండల్ ఉద్యమం నుంచి కులగణన ఉద్యమం వరకు అదే ధోరణి కొనసాగుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి ..

Latest articles

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...

ఆ నలుగురు అరెస్ట్.!

గుప్త నిధుల పేరుతో మోసానికి యత్నం.. నలుగురు అరెస్ట్ ఉట్నూర్ కోటలో తవ్వకాలకు ప్రయత్నం.. వీడియోలతో ప్రజలను నమ్మించే యత్నం 4...

More like this

అనుమతులు లేకుండా కల్తీ కల్లు విక్రయం.. 

ఒకరికి రూ.50 వేలు.. మరొకరికి రూ.10 వేల జరిమానా బైండోవర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న తలమడుగు ఎస్‌ఐ...

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్‌దే అధికారం: కృష్ణ రత్న ప్రకాష్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి.. బీఆర్ఎస్‌కు మద్దతు పెరుగుతోంది తాంసి నుంచి బోథ్ ధర్నాకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్...

19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు పైగా కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర నేరగాడు అరెస్ట్

ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ సైబర్ మోసం 19 రాష్ట్రాల్లో 140 మంది బాధితులు.. రూ.5.30 కోట్లకు...